Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 16 February 2022

‘బొట్టు, గాజులకు అనుమతి ఉంది.. హిజాబ్‌కు ఎందుకు లేదు?’

హిజాబ్ వివాదంపై విచారణ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవి వర్మ కుమార్.. ప్రజలు ప్రతిరోజూ ధరించే దుపట్టాలు, గాజులు, తలపాగాలు, శిలువలు, బొట్టు వరకూ వందలాది మతపరమైన చిహ్నాలు ఉన్నప్పుడు హిజాబ్‌ను ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారని న్యాయమూర్తులను ప్రశ్నించారు. ‘‘సమాజంలోని విస్తారమైన అన్ని వర్గాల మతపరమైన చిహ్నాలు వైవిధ్యాన్ని మాత్రమే చూపుతున్నాను.. ప్రభుత్వం ఒక్క హిజాబ్‌ను ఎందుకు ఎంచుకొని ఈ విద్వేషపూరిత వివక్ష చూపుతోంది? గాజులు ధరించారా? అవి మత చిహ్నాలు కాదా? కేవలం ఈ ముస్లిం అమ్మాయిలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?.. కేవలం ఆమె మతం కారణంగానే బయటకు పంపుతున్నారు. బొట్టు పెట్టుకున్న అమ్మాయిని బయటకు పంపరు.. గాజులు ధరించిన అమ్మాయి కాదు.. శిలువ ధరించిన క్రైస్తవుడు తాకరు.. ఈ అమ్మాయిలు మాత్రమే ఎందుకు? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమే’’ అని వాదించారు. ‘‘బొట్టు, గాజులకు అనుమతి అనుమతి ఉంది.. హిజాబ్‌కు మాత్రమే ఎందుకు ఆంక్షలు? క్రైస్తవుల శిలువను, సిక్కు తలపాగాను ఎందుకు ధరించకూడదు?.. మరే ఇతర మతాల చిహ్నాలకు ఆంక్షలు ఉండవు.. కానీ, ముస్లిం బాలికలపై వివక్ష పూర్తిగా మతం ఆధారంగా ఉందని, అందుకే ఈ వివక్ష’’అని వాదించారు. హిజాబ్ ధరించినందుకు విద్యార్థులను శిక్షించడం లేదా తరగతి గది నుంచి పంపిన సందర్భాలను నిరసిస్తూ.. ‘‘హిజాబ్‌తో వచ్చినవారిని లోపలికి అనుమతించకుండా మరీ ఇంత క్రూరమైన శిక్షణ విధిస్తారా? వారిని ఉపాధ్యాయులు అని పిలవవచ్చా?.. మతం కారణంగా పక్షపాతం చూపుతున్నారు.. ఎటువంటి నోటీసులేకుండా అధికారం లేని వ్యక్తుల ద్వారా బయటకు పంపుతున్నారు’’ అని అన్నారు. ‘‘తరగతి గదిలో ముస్లిం బాలికలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందనే విషయానని న్యాయపరమైన గమనికగా తీసుకోవాలి.. ఈ సాకుతో వారిని బయటకు పంపితే అది చాలా క్రూరంగా ఉంటుంది’’ పేర్కొన్నారు. మరోవైపు, హిజాబ్‌ వివాదం బుధవారం జూనియర్‌ కళాశాలల్లో పునరావృతమైంది. హిజాబ్‌ను అనుమతించేది లేదంటూ పలు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. హిజాబ్‌ ధరించని విద్యార్థినులను మాత్రమే లోనికి అనుమతించారు. ఉడుపిలో హిజాబ్‌ను తొలగిస్తున్నట్లు నమ్మించిన విద్యార్థినులు తరగతి గదిలోకి వెళ్లాక ధరించడం గందరగోళానికి దారితీసింది. హిజాబ్‌ను తొలగించే వరకూ పాఠాలు చెప్పే ప్రసక్తేలేదని అధ్యాపకులు స్పష్టం చేశారు. శివమొగ్గ, ఉడుపి, ధార్వాడ, బెళగావి తదితర జిల్లాల్లో హిజాబ్‌ వివాదం తీవ్రరూపం దాల్చడంతో కళాశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో తదుపరి ఉత్తర్వుల వరకు అంటూ, అనేక ప్రాంతాల్లో మూడు రోజులు సెలవులిచ్చారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/uRSgexo

No comments:

Post a Comment