Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 21 July 2019

‘జగన్ నిర్ణయాలతో బాబు అండ్ కో బ్యాచ్ వెన్నులో వణుకు’

అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాలు, కాంట్రాక్టులపై జ్యుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సమీక్ష సహా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో చంద్రబాబు అండ్ కో బ్యాచ్‌ వెన్నులో వణుకు మొదలైందని విజయసాయి వ్యాఖ్యానించారు. అందుకే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారిలో కొందరు పార్టీలు మారిపోయి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరు ఏం చేసినా తప్పించుకోలేరని హెచ్చరించారు. అలాగే సీఎం జగన్ నిర్ణయం వల్ల 15.30 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరుగుతోందని, చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదంటూ దుయ్యబట్టారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ కౌలు రైతుల వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం జగన్ గారు 15.30 లక్షల మంది కౌలుదార్లకు రైతు భరోసాతో పాటు అన్ని పథకాలు వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. నాయకుడికి, భ్రమలు కల్పించి నాటకాలాడే వారికి తేడా ఇదే మరి’ అంటూ ధ్వజమెత్తారు. Read Also: ‘జుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్తు పీపీఏలపై సమీక్ష వంటి నిర్ణయాలతో చంద్రబాబు, ఆయన కోటరీకి వెన్నులో వణుకు మొదలైంది. రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. కొందరు పార్టీ మారి ఎస్కేప్ రూట్ పట్టారు. ఏం చేసినా తప్పించుకోలేరు’ అంటూ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించడం విశేషం. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలతో పాటు మీ మీద కూడా ఎంక్వయిరీ వేసుకొని, మీరు కూడా నిప్పు అని నిరూపించుకొండని ఏ నెటిజన్ రిప్లయ్ ఇచ్చాడు. చేసేదోదే త్వరగా చేయండి అంటూ మరొకరు సలహా ఇచ్చారు. ఏం చేసినా మీరు ఏమి కనుక్కోలేరని, కొండనుతవ్వి ఎలుకను పట్టుకోవడం లాంటిదేనని మరొకరు ట్వీట్ చేయడం గమనార్హం.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Z55KM8

No comments:

Post a Comment