Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 27 February 2021

మూడో అంతస్తులో అగ్నిప్రమాదం.. పిలల్ని కిటికీలోంచి ప‌డేసిన త‌ల్లి, అందరూ సేఫ్

వనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే మంటలు చుట్టుముట్టాయి. ఆ భవనంలోని మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో తల్లి, నలుగురు చిన్నారులు ఉన్నారు. వారి ఇంటి ద్వారం ముందు అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తప్పించుకునే మార్గమే లేదు. దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి ఊహించని నిర్ణయం తీసుకుంది. కాళ్లు, చేతులు విరిగినా.. పర్వాలేదు గానీ, తన పిల్లలు అగ్నికి ఆహుతి కాకూడదనుకుందేమో.. వారిని కిటికీలో నుంచి కిందకు విసిరేసింది. ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని మూడో అంత‌స్తులో ఉన్న మ‌హిళ‌ త‌న న‌లుగురు పిల్లలను కిటికీ నుంచి కిందకు విసిరేసిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే.. ఆ భవనం కింద‌ ఉన్న కొంత మంది వాలంటీర్లు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. పిల్లలు సురక్షిత స్థితిలో ఉండటంతో ఆ తల్లి మనసు శాంతించింది. ఈలోగా మంటలు, దట్టమైన పొగ వారి ఫ్లాట్‌ను కమ్మేశాయి. ఈ తర్వాత అగ్నిమాప‌క సిబ్బంది వచ్చి భవనంలో మంటలను ఆర్పేశారు. భవనంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ తల్లి, పిల్లలందరూ సుర‌క్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. Don't Miss: ✦ ✦ ✦


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3qUOzuN

No comments:

Post a Comment