Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 20 July 2019

గోనెసంచిలో బాలిక శవం.. మేడ్చల్‌లో కలకలం

మేడ్చల్‌లోని ఓ బస్తీలో గోనెసంచిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. పట్టణంలోని ఓ బస్తీలో ఈరోజు ఉదయం గోనెసంచిని గుర్తించిన స్థానికులు దాన్ని తెరిచారు. అందులో 16-18ఏళ్ల వయసు గల బాలిక మృతదేహం ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గోనెసంచిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 18ఏళ్ల కంటే తక్కువగా ఉంటుందని, మొహం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుందని పోలీసులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచి ఎవరిపనుల్లో వారు బిజీగా ఉన్న మేడ్చల్ వాసులు గోనెసంచిలో బాలిక మృతదేహాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K5nctZ

No comments:

Post a Comment