Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 20 July 2019

జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్.. ఇక నేరుగా విమానం వద్దకు ప్రభుత్వ వాహనంలో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సాధారణ పాస్‌పోర్ట్ స్థానంలో డిప్లమాటక్ పాస్‌పోర్ట్‌ను అందజేశారు. శనివారం విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసుకు తన సతీమణి భారతితో కలిసి జగన్ చేరుకున్నారు. సీఎంకి అధికారులు ఈ పాస్‌పోర్ట్‌ను అందజేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్, రాయబారులకి మాత్రమే ఈ పాస్‌పోర్ట్ జారీచేస్తారు. కలిగిన వ్యక్తులకు విమానాశ్రయంలో నేరుగా ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు. విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేకమైన లాంజ్ కూడా ఉంటుంది. అలాగే విమానం బయలుదేరడానికి గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాలన్న నిబంధన ఉండదు. నేరుగా తాము వెళ్లాల్సిన విమానం వద్దకు ప్రభుత్వ వాహనంలో చేరుకోవచ్చు. అలాగే విదేశాల్లో కూడా డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఇదేరకమైన సదుపాయాలు ఉంటాయి. త్వరలో ఏపీ సీఎం జగన్ అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో డిప్లమేటిక్ పాస్ పోర్ట్ తీసుకున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఈ పాస్‌పోర్ట్ తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండోరోజు చంద్రబాబు దీనిని అప్పగించిన సాధారణ పాస్‌పోర్ట్ తీసుకున్నారు. ఈ పాస్‌పోర్ట్ కలిగిన ఉన్నవారు విదేశాలకు వెళ్లేటప్పుడు ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యంత ముఖ్యులుగా గౌరవిస్తారు. ఇలా అన్ని దేశాల నుంచి ముఖ్యులకు డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ ఇస్తారు. అన్ని దేశాల మధ్య ఈ పాస్‌పోర్ట్ జారీ చేసే అంశంపై అవగాహన ఒప్పందం ఉంటుంది. విమానంలో కూడా ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు. అధికారిక పర్యటనకు వెళ్ళేటప్పుడు ఆయన వెంటన వచ్చే అధికారుల బృందానికి కూడా ఈ వసతులు లభిస్తాయి. మొత్తంగా డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఒక మిలియన్ అడ్వాంటేజిస్ ఉంటాయని పాస్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yfr2cP

No comments:

Post a Comment