Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

కేఫ్ కాఫీ డే అధినేత, మాజీ ముఖ్యమంత్రి అల్లుడు మిస్సింగ్!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత సోమవారం రాత్రి నుంచి కనిపించడంలేదు. అయితే, ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సిద్దార్థ కేఫ్ కాఫీ డే సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించారు. ఆయనకు చిక్‌మంగళూరులో 12,000 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ ఎస్టేట్ ఉంది. సిద్దార్థ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రచారం సాగడంతో పోలీసులు గాలిస్తున్నారు. నేత్రావతి నదిలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నేత్రావతి నది వంతెనపై నుంచి కారులో వెళ్తుండగా వాహనాన్ని ఆపమని డ్రైవర్‌కు చెప్పిన సిద్దార్థ.. అందులో నుంచి దిగివెళ్లిపోయినట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. కారు నుంచి దిగి వెళ్లిపోయిన సమయంలో... సిద్దార్థ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నారని డ్రైవర్ తెలిపాడు. దీంతో ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే అనుమానంతో అక్కడ గాలిస్తున్నారు. సిద్దార్థ కనిపించడంలేదనే వార్త క్షణాల్లో కర్ణాటక అంతటా వ్యాపించింది. దీంతో ఎస్ఎం కృష్ణ ఇంటికి సిద్దార్థ బంధువులు,స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కాగా, ఎస్ఎం కృష్ణ కుమార్త మాళవికను వీజీ సిద్దార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద కేఫ్ కాఫీ డే సంస్థతో పాటు హాటల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. 1990లో మొదటిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో కేఫ్ కాఫీ డేను ఏర్పాటు చేశారు. మంగళూరు యూనివర్సిటీ నుంచి ఆర్ధికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్న సిద్దార్థ కొన్నాళ్ల పాటు స్టాక్ మార్కెట్ వ్యాపారం విజయవంతంగా నిర్వహించారు. పదిహేనేళ్ల పాటు ఆ రంగంలో ఉన్న సిద్ధార్థ, కాఫీ వ్యాపారంలోని ప్రవేశించారు. 1993లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన, అనతి కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 1996లో కేఫ్ కాఫీ డేను ప్రారంభించి దేశవ్యాప్తంగా 1550 బ్రాంచీలను ఏర్పాటుచేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K5PeoQ

No comments:

Post a Comment