Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 6 August 2019

షీలా, సుష్మ.... 2వారాల వ్యవధిలో ఇద్దరు మాజీ సీఎంల కన్నుమూత

జాతీయ స్థాయిలో ఉత్తమ నేతలుగా గుర్తింపు పొందిన ఇద్దరు మహిళా నాయకురాళ్లు రెండు వారాల వ్యవధిలో కన్నుమూయడం దేశ రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. ఆ ఇద్దరూ గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పంచినిచేసిన షీలా దీక్షిత్, సుష్మాస్వరాజ్. షీలా కంటే 14ఏళ్లు చిన్న వారైన అమె కంటే ముందే ఢిల్లీ సీఎం పీఠం మీద కూర్చున్నారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుష్మ 40 రోజుల్లోగా ఈ పీఠం దిగాల్సి వచ్చింది. ఆకస్మాతుగా పెరిగిన ఉల్లిగడ్డల ధర ఆమె ప్రభుత్వాన్ని దించేశాయి, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన 2013 వరకు 15ఏళ్ల పాటు పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన షీలా జులై 20వ తేదీన కన్నుమూశారు. దీంతో తామంతా పెద్దదిక్కును కోల్పోయామంటూ కాంగ్రెస్ శ్రేణులు కన్నీరు పెట్టుకున్నాయి. ఇప్పుడు సుష్మా స్వరాజ్ మృతితో బీజేపీ నేతలు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయంలో ఈ చిన్నమ్మను మరిచిపోవద్దంటూ ప్రజలకు ఆమె చేసి విన్నపాన్ని అందరూ మననం చేసుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అయితే సుష్మా స్వరాజ్ భౌతికకాయాన్ని చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎన్డీయే ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన ఆపదలో ఆదుకునే అమ్మగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. భారతీయులెవరైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపదలో ఉన్నామంటూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు ఆమె వెంటనే స్పందించేవారు. వీసా రాక ఇబ్బంది పడే వారు, విదేశాలకు వెళ్లి పాస్‌పోర్టు పోగొట్టుకున్నవారు, వైద్యం కోసం భారత్‌కు వచ్చే విదేశీయులు.. ఇలా ఎవరైనా సరే తమ సమస్యలను ఆమె దృష్టికి తెస్తే వెంటనే స్పందించి పరిష్కరించేవారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yEXaZ8

No comments:

Post a Comment