Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 3 October 2019

కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల సహా 16 మంది అరెస్ట్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత రెండు నెలలుగా జమ్మూ కశ్మీర్‌ సైన్యం పహారాలో ఉంది. సరిహద్దుల్లో చొరబాటుకు చేస్తున్న ఉగ్రవాదుల ప్రయత్నాలను సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టుచేసినట్టు అధికారులు గురువారం వెల్లడించారు. హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైన్యం తనిఖీలు చేపట్టి వారిని అదుపులోకి తీసుకుంది. బుధవారం నాటి అరెస్టులతో దోడా- కిస్టవార్ జిల్లాల్లో హిజ్బుల్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను సైన్యం భగ్నం చేసిందని, ఇక్కడ మరికొందరికి తీవ్రవాదంతో సంబంధం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. తీవ్రవాదులు, వారి సానుభూతిపరులు మొత్తం 16 మందిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అరెస్టయినవారిలో ఉగ్రవాదులు ఫరూఖ్ భట్, మంజూర్ గెనై, మసూద్, నూర్ మహ్మద్ మాలిక్‌లను హిజ్బుల్ ఉగ్రవాదులుగా గుర్తించినట్టు తెలిపారు. మొత్తం 45 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా కిస్ట్‌వార్‌ను పదేళ్ల కిందట ఉగ్రవాదుల ఉనికిలేని జిల్లాగా ప్రకటించారు. అయితే, గత నవంబరు నుంచి బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నేత సహా నలుగుర్ని ఉగ్రవాదులు హతమార్చారు. అలాగే ఆయుధాలను ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కిస్ట్‌వార్ జిల్లాలో ఉగ్రకదలికలు మొదలైనట్టు సైన్యం గుర్తించింది. ఈ జిల్లాలో ఉగ్రవాద భావజాలాన్ని బలంగా వ్యాపింపజేసిన ఓసామా సహా ముగ్గురు ఉగ్రవాదులను గత శనివారం ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్మూ-కిస్ట్‌వార్ జాతీయ రహదారి సమీపంలోని బటోట్‌ వద్ద జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు అమరుడయ్యాడు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/334OWGC

No comments:

Post a Comment