Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 4 October 2019

పైసల్లేవు.. కేంద్ర నిధులివ్వట్లేదు, కానీ వాటికి కోతపెట్టబోం.. హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ఢోకా లేదన్నారు. తమది సంక్షేమ ప్రభుత్వమన్న హరీశ్.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కోత విధించినప్పటికీ.. సంక్షేమానికి కోత విధించబోమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రగల్భాలు పలుకుతున్నాయన్న .. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును పక్క రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నిరంతరాయంగా కరెంట్ సరఫరా అవుతోందని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారని తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంట్‌ను ఇస్తూ రైతు కళ్లలో వెలుగులు నింపుతున్నామని హరీశ్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రైతులేనన్నారు. కేసీఆర్‌ను రైతుబాంధవుడిగా ఆయన అభివర్ణించారు. రైతు బంధుతో ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం ఇస్తూ రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపామన్నారు. పంటల పెట్టుబడి సహాయం వచ్చే 15 రోజుల్లో అందుతుందన్నారు. రైతులకు ఎరువుల కొరత, విత్తనాల కొరత లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మండలానికి ఒకటి చొప్పున 5 వేల మెట్రిక్ టన్నుల గోదాములను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు మంచి మద్దతు ధర కల్పిస్తున్నామన్న హరీశ్.. తొందరపడి ఎవరూ ధాన్యం అమ్ముకోవద్దన్నారు. పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో ధాన్యం అమ్ముకుంటున్నాయని అన్నారు. మన రాష్ట్ర రైతుల తర్వాతే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. చెరుకు రైతులకు అండగా ఉంటామన్న మంత్రి.. చెరుకు రైతు బిల్లులు కూడా చెల్లిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.21 కోట్లకు ముందుగా రూ. 10 కోట్లు విడుదల చేస్తామని, వచ్చే 15 రోజుల్లో మిగిలిన రూ.11 కోట్లు ఇస్తామన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2pKodB4

No comments:

Post a Comment