Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 5 October 2019

పదేళ్లుగా ఒకరితో సహజీవనం.. అతని ఫ్రెండ్‌తోనూ అక్రమ సంబంధం.. చివరికి..!

ఆమె కట్టుకున్న భర్తను వదిలేసింది.. పదేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అంతటితో ఆగకుండా అతని స్నేహితుడితో పెట్టుకుంది. చివరకు తన పాత ప్రియుడిని కొత్త ప్రేమికుడితో చంపించిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ తరువాత ప్రియుడు వేధింపులకు దిగుతుండడంతో తనే పోలీసులకు పట్టించిన అసాధారణ ఘటన ఇది. తమిళనాడులోని నామక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వి భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. కుమారపాళయంకు చెందిన నేత కార్మికుడు వెంకటేశన్‌(38)తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది. పదేళ్లు అతనితో సహజీవనం చేసింది. కొద్దికాలంగా వెంకటేశన్ నిత్యం మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడు. Also Read: ఈ క్రమంలో వెంకటేశన్ స్నేహితుడు పెరుమాళ్‌తో సెల్వికి పరిచయమైంది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వెంకటేశన్ ఇద్దరినీ నిలదీయడంతో అతనని చంపేయాలని ప్లాన్ చేశారు. ఓ రోజు మద్యం తాగుదామని వెంకటేశన్‌ను పెరుమాళ్ వెంట తీసుకెళ్లాడు. ఫుల్లుగా మద్యం తాగించి కావేరి నదిలోకి తోసేశాడు. Read Also: వెంకటేశన్ మృతిపై విచారణ చేపట్టిన పోలీసులకు సెల్వి, ఆమె ప్రియుడు పెరుమాళ్‌ను ప్రశ్నించగా హత్యకు సంబంధించి విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వేధింపులు తట్టుకోలేక వెంకటేశన్‌ను చంపేసినట్టు సెల్వి ఒప్పుకోవడంతోపాటు పెరుమాళ్‌ను పోలీసులకు పట్టించింది. పెరుమాళ్ తన కుమార్తెపై కన్నేశాడని, అందువల్లే అతన్ని పట్టించాలని నిర్ణయించుకున్నట్లు సెల్వి పోలీసుల విచారణలో వెల్లడించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/334itQT

No comments:

Post a Comment