Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 25 February 2020

ఢిల్లీ సర్కారీ బడిలో మెలనియా ట్రంప్... ‘హ్యాపీనెస్ క్లాస్‌’లకు ఫిదా

హైదరాబాద్ హౌస్‌లో భారత్, అమెరికా దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న వేళ.. ట్రంప్ సతీమణి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘’ కార్యక్రమాన్ని ఆమె మంగళవారం ఉదయం పరిశీలించారు. మోతీ బాఘ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ.. బ్యాండ్‌తో మెలినియాకు స్వాగతం పలికారు. చిన్నారులు ఫస్ట్ లేడీ మెడలో పూల దండలు వేసి, పుష్ఫ గుచ్ఛం అందజేశారు. సంప్రదాయ బద్ధంగా నుదుటున కుంకుమతో బొట్టుపెట్టి, హారతి ఇచ్చి మెలనియాను పాఠశాలలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె ‘హ్యాపీనెస్‌ క్లాస్’లో పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారుల డ్యాన్స్ ప్రదర్శనలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని మెలనియా తెలిపారు. భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కానీ.. ఇదో గొప్ప అనుభవం అన్నారు. హ్యాపీనెస్ క్లాసులు తనను ఆకట్టుకున్నాయన్నారు. పాఠశాలకు తనను ఆహ్వానించడం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులు స్వయంగా గీసిన మధుబని పెయింటింగ్స్‌ను మెలనియా ట్రంప్‌కు బహుమానంగా అందజేశారు. విద్యార్థులకు షేక్ హ్యాండ్ ఇచ్చిన మెలనియా.. ఓ విద్యార్థినిని హత్తుకున్నారు. మెలనియా ట్రంప్‌ను ఈ రోజు తమ పాఠశాలలో హ్యాపీనెస్ క్లాసుకు హాజరవుతారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తమ విద్యార్థులు, టీచర్లు ఇదో గొప్ప రోజన్నారు. శతాబ్దాలుగా భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను నేర్పిందన్నారు. మెలనియాకు స్కూళ్లో కేజ్రీవాల్, సిసోడియా స్వాగతం పలకాలని.. హ్యాపీనెస్ క్లాస్‌ల గురించి ఆమెకు తెలపాలని భావించారు. కానీ ఆహ్వానితుల జాబితాలో కేజ్రీవాల్, సిసోడియా పేరు ఉంచొద్దని యూఎస్ ఎంబసీ కోరింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3a0SA88

No comments:

Post a Comment