Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 27 February 2020

YS Jagan విశాఖలో అడుగుపెడితే.. వైసీపీ ఈరోజు ట్రైలర్ చూపెట్టింది: లోకేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటనకు వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డు తగిలాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన కాన్వాయ్‌ను బయటకు రానీయకుండా వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించి అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు గంటల తరబడి తన వాహనంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బాబును అడ్డుకోవడం కోసం వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారని ఆరోపిస్తున్నారు. విశాఖలో చంద్రబాబును వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డగించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్పందించారు. ‘‘జగన్ విశాఖలో అడుగుపెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్‌లో ఉంటుందో వైకాపా ఈ రోజు ట్రైలర్ చూపించింది. ప్రతిపక్ష నేతపై ఈ రోజు గుడ్లు, టొమేటోలు రేపు ప్రజలపై బాంబులు, కత్తులతో దిగుతుంది వైకాపా రౌడీ బ్యాచ్’’ అని ఘాటైన విమర్శలు చేశారు. ‘‘మూడు ముక్కలాట మొదలు పెట్టి సగం చచ్చారు. ప్రతిపక్ష నేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారు. వైకాపా డిఎన్ఏ లో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖలో బయటపడ్డాయి’’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? వోక్స్ వ్యాగన్ సొమ్ముల్లానే హుద్ హుద్ సమయంలో సహాయం కోసం జగన్ ఇచ్చాను అంటున్న రూ.50 లక్షలు పోనాయి ఏటి సేత్తాం. దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి చావు దెబ్బ కొట్టిన జగన్ గారిని "గో బ్యాక్" అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుంది’’ అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2wT9yqP

No comments:

Post a Comment