Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 3 August 2020

భర్తను చితకబాది.. భార్యను పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. కర్నూలు జిల్లాలో దారుణం

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు కామాంధులు భర్త కళ్లెదుటే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెలుగోడు మండలంలో శుక్రవారం(జులై 31) అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెలుగోడు మండలానికి చెందిన గిరిజన దంపతులు గాలేరు వాగు వంతెన నిర్మాణ పనుల వద్ద వాచ్‌మన్లుగా పని చేస్తున్నారు. జూలై 31న అర్ధరాత్రి బండిఆత్మకూరు మండలం నారపురెడ్డికుంట గూడేనికి చెందిన ముగ్గురు వ్యక్తులు మద్యం తాగి అక్కడికి వచ్చారు. Also Read: భర్తపై దాడిచేసిన ఆ ముగ్గురు కామాంధులు మహిళను ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పిన బాధితులు అదే రోజు భర్తపై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం బాధితురాలు మరోసారి స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగినట్లు ఫిర్యాదు చేసింది. గిరిజన మహిళపై అత్యాచారానికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు సోమవారం పోలీస్‌స్టేషను ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కేసుపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని బాధితురాలి భర్త, బంధువులు ఆరోపిస్తున్నారు. Also Read: ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ... సోమవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు వ్యక్తులపై సెక్షన్‌ 376(డి) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆరోపణలు వచ్చిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39VAeq4

No comments:

Post a Comment