Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 24 September 2020

పోలీస్ ముసుగులో కీచకపర్వం.. ఏకంగా 40 మందిపై అత్యాచారం

పోలీస్ అవతారమెత్తిన లారీ డ్రైవర్ ఏకంగా 40 మందికి పైగా మహిళలను చేసిన అత్యంత దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. రెడ్‌హిల్స్ ఏరియాకి చెందిన లారీ ఓనర్ పిచ్చైమణి ఖాకీ డ్రెస్ వేసుకుని వీధుల్లో బైక్‌పై తిరుగుతూ ఉంటాడు. పుజాల్, రెడ్‌హిల్స్ ఏరియాలోని నిర్మానుష్య ప్రదేశాల్లో ఏకాంతంగా ఉన్న ప్రేమజంటలను టార్గెట్ చేసి రహస్యంగా వారి వీడియోలు, ఫొటోలు తీస్తాడు. అనంతరం వాటిని చూపించి మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి తన కామవాంఛలు తీర్చుకుంటాడు. అలా ఇప్పటి వరకూ సుమారు 48 మందిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మణి చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు ధైర్యం చేసి పుజాల్ పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బైక్‌పై వీధుల్లో తిరుగుతూ ప్రేమ జంటల వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేస్తున్నట్లు తేల్చారు. నిందితుడి సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. అందులో మహిళల ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను గుర్తించారు. Also Read: బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడి సీసీకెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. రెడ్‌హిల్స్ ఏరియాలో ప్రేమ జంట ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె వద్దకు వెళ్లి రహస్యంగా తీసిన వీడియోలు చూపించడంతో ప్రియుడు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. అనంతరం ఆమెను బెదిరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె వద్ద నగదు, సెల్‌ఫోన్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2FWoXv9

No comments:

Post a Comment