Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 1 November 2020

పాతవాసన పోలేదేమో.. హస్తం గుర్తుకే ఓటేయండన్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య!

పుట్టుకతోనే కాంగ్రెస్‌ పార్టీలో ఉండటంతో బీజేపీలో చేరినా పాత వాసన పోలేదేమో.. మధ్యప్రదేశ్ యువనేత ఎన్నికల ప్రచారంలో హస్తానికి ఓటేయమన్నారు. మనసులో బలంగా నాటుకుపోయిన నామం బయటకు వచ్చింది. తాజాగా, ఉప-ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన సింధియా.. హస్తం గుర్తుకే ఓటేయండి అని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. దీంతో నాలుక్కురుచుకుని, సరిద్దిద్దుకునే ప్రయత్నం చేశారు. దబ్రా నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి ఇమర్తీ దేవి దబ్రా నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఇమర్తీ దేవిని 'ఐటమ్'గా అభివర్ణించి, విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆమె తరఫున ప్రచారానికి వచ్చిన సింధియా మాట్లాడుతూ.. ‘మీ చేతులు కలపండి.. నన్ను, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను గెలిపిస్తామని చెప్పండి.. దాబ్రా ప్రజలారా, నా ప్రియమైన ప్రజలారా... నవంబు 3న మీరంతా హస్తం గుర్తుకు ఓటు వేయాలి’ అని అన్నారు. ఆ వెంటనే తన తప్పును తెలుసుకున్న జ్యోతిరాదిత్య.. వెంటనే సరిదిద్దుకున్నారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సింధియా మాట్లాడిన వీడియోలు వైరల్ కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఈ వీడియోను ట్విట్టర్2లో పోస్ట్ చేసింది. ‘సింధియా జీ... మధ్యప్రదేశ్ ప్రజలు నవంబర్ 3న హస్తం గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారు’ అని క్యాప్షన్ పెట్టింది. కాగా, సింధియా వర్గానికి చెందిన మంత్రి ఇమర్తీ దేవితో సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2018 ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌కు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సింధియా తన వర్గం ఎమ్మెల్యేతో సహా బీజేపీకి గూటికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిలో కూలిపోయింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3eo8A7x

No comments:

Post a Comment