Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 17 July 2021

దారుణం.. ఆస్తికోసం తండ్రి కాళ్లూ చేతులు కట్టేసి రైలు పట్టాలపై పడేసిన కొడుకు

ఆస్తి తగాదాలతో కన్న తండ్రినే కుమారుడు కాళ్లూ చేతులూ కట్టేసి, నోరు కుట్టేసి రైల్వే ట్రాక్‌పై పడేశాడు. ఈ అమానవీయ ఘటన ఝార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదం నేపథ్యంలో వృద్ధుడి రెండో భార్య కుమారుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలామూ జిల్లా భీతిహార్వాకు చెందిన భోలారామ్‌ (65)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఆరుగురు పిల్లలు, రెండో భార్యకు ఓ కుమారుడు ఉన్నారు. భోలారామ్ చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద భార్య చనిపోవడంతో 2010లో భోలారామ్ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, రెండో భార్య వల్ల కుటుంబంలో ఆస్తి కోసం వివాదాలు మొదలయ్యాయి. ఈ విషయమై పలుమార్లు పెద్దల పంచాయితీ కూడా జరిగింది. ఇరు వర్గాలకు సర్దిచెప్పి రాజీ కుదిర్చారు. కానీ, అక్కడ జరిగిన నిర్ణయంతో సంతృప్తి చెందని రెండో భార్య కుమారుడు... మంగళవారం రాత్రి భోలారామ్ నోరు కుట్టి, కాళ్లూచేతులు కట్టేసి రైల్వే ట్రాక్‌పై పడేశాడు. ఆ సమయంలో అటుగా ఏ రైలూ రాకపోవడంతో వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున గ్రామస్థులు అక్కడకు చేరుకుని భోలారామ్‌ కట్లువిప్పి ట్రాక్‌పై నుంచి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని భోలారామ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెనుక రెండో భార్య కూడా ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. తనను రాత్రి 11 గంటల సమయంలో కట్టేసి ట్రాక్‌పై పడేసినట్టు బాధితుడు తెలిపాడు. ఏడాది నుంచి గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. ఆరు మాసాల కిందటే పెద్దలు సమక్షంలో ఒప్పందం జరిగిందని, అయినా రెండో భార్య దీనిపై అభ్యంతరం చెప్పిందని అన్నాడు. దీంతో కేసు నమోదుచేసిన ఉంటారి రోడ్‌ స్టేషన్ పోలీసులు.. ఇరు వర్గాలనూ స్టేషన్‌కు రప్పించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కుటుంబసభ్యుల మధ్య రాజీకి ప్రయత్నించినట్టు తెలిసింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3xOgEHt

No comments:

Post a Comment