
ప్రియురాలితో శృంగారంలో పాల్గొన్న ఓ యువకుడు.. కండోమ్కు బదులు జిగురు లాంటి ఓ పదార్థాన్ని ఉపయోగించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ మీర్జా (25) అనే యువకుడు జూన్ 23న తన ఇంటి సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కొందరు గమనించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, సల్మాన్ ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని పోలీసులు భావించారు. కానీ, దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. యువకుడు అసహజ రీతిలో శృంగారంలో పాల్గొనడం వల్లే మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు. యువకుడు సల్మాన్ మీర్జా జూన్ 22న తన ప్రేయసితో కలిసి ఓ హోటల్కు వెళ్లాడు. కండోమ్ తీసుకెళ్లడం మర్చిపోయిన సల్మాన్.. సెక్స్లో పాల్గొనేటప్పుడు దానికి బదులు జిగురు లాంటి పదార్థం (epoxy adhesive)ను వినియోగించాడు. దాని ప్రభావంతో అతడి మర్మాంగం సహా పలు అవయవాలు చెడిపోయి మృత్యువాతపడ్డాడు. కండోమ్ను తీసుకెళ్లడం మర్చిపోవడంతో గర్భం రాకుండా ఉండేందుకే వారు ఆ జిగురును వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ మర్నాడే యువకుడు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్, అతడి ప్రియురాలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు దర్యాప్తులో గుర్తించారు. జూన్ 22న ఆటోలో మరో మహితో కలిసి హోటల్కు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. మత్తుకోసం ఇరువురూ వైటనర్ను ముక్కుతో పీల్చుతుంటారని తేలింది. అహ్మదాబాద్ 7వ జోన్ డీసీపీ ప్రేమ్సుఖ్ మాట్లాడుతూ.. సల్మాన్ తాజా పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదని.. అది వచ్చాక ఈ విషయంపై మరింత స్పష్టత రానున్నట్లు ఆయన తెలిపారు. అతడి వీర్యం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని వివరించారు. సల్మాన్ ఒక్కడే ఇంటికి పెద్ద దిక్కని, అతడికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరిలు ఉన్నారని పేర్కొన్నారు. సల్మాన్ తండ్రి సైరాబాను మిర్జా జూన్ 25న పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3DmR7sq
No comments:
Post a Comment