Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 26 August 2021

కాబూల్ విమానాశ్రయం తక్షణమే వీడండి.. భారీ ఉగ్రదాడికి కుట్ర: అమెరికా హెచ్చరిక

ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందని.. , పరిసర ప్రాంతాల నుంచి తక్షణమే వచ్చేయాలని పలు పశ్చిమ దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. ఆగస్టు 15న తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఇప్పటి వరకూ 90వేల మంది విదేశీయులు, అఫ్గన్ పౌరులు అమెరికా నాయకత్వంలో నుంచి తరలించారు. గత పది రోజులుగా కాబూల్ విమానాశ్రయానికి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. దీంతో విమానాశ్రయం చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉంటున్నారు. అటు, విదేశీయుల తరలింపు ఆగస్టు 31లో పూర్తిచేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఉగ్ర ముప్పు కూడా పొంచి ఉందని మిత్ర దేశాలకు అమెరికా అప్రమత్తం చేసింది. అలాగే, ఆగస్టు 31 తర్వాత అమెరికా దళాలు తమ గడ్డపై ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాలిబన్లు హెచ్చరించారు. అమెరికా ప్రభుత్వం.. దాని మిత్రదేశాలు తమ పౌరులను గురువారం హెచ్చరించాయి. కాబూల్ విమానాశ్రయం ‘అబ్బే గేట్, ఈస్ట్ గేట్ లేదా నార్త్ గేట్ వద్ద ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలి’ అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఓ హెచ్చరిక జారీచేసింది. భారీ ఉగ్రదాడికి అవకాశం ఉందని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆస్ట్రేలియా పౌరులు వెళ్లొద్దు.. ఒకవేళ ఆ ప్రాంతంలో ఉంటే తదుపరి సూచనలు చేసే వరకూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి’ అని తెలిపింది. ఇటు బ్రిటన్ సైతం ఇటువంటి హెచ్చరికలే జారీ చేసింది. అఫ్గన్ నుంచి తక్షణమే సురక్షితంగా వచ్చేయాలని పేర్కొంది. కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికన్లతోపాటు అప్ఘాన్లను యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో తరలింపు కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు నియంత్రణను ఏకీకృతం చేశారు. కాబూల్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం, విమానాశ్రయం గేట్ల వెలుపల ఉన్న అమెరికన్ పౌరులకు ఆ దేశ రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది, బయట ఉన్న అమెరికన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని కోరింది. ఇటీవల కాలంలో పలు దేశాల్లో జరుగుతున్న ఉగ్రదాడులకు అఫ్గన్-పాకిస్థాన్ ఐఎస్ వింగ్ బాధ్యత వహిస్తోన్న విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని మసీదులు, ప్రార్థనా మందిరాలు, పబ్లిక్ ప్రదేశాలు, ఆస్పత్రుల్లో దాడులకు పాల్పడుతోంది. అయితే, తాలిబన్లు, ఐఎస్ బద్ధ శత్రువులు.. అయితే, వీరంతా ఒక్కతాటిపైకి వచ్చి పశ్చిమ దేశాలను టార్గెట్ చేసుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3gyf71Y

No comments:

Post a Comment