Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 18 February 2022

కీలక రహస్యాలు పంపడానికి ఇంటర్నెట్‌ వాడొద్దు.. కేంద్రం హెచ్చరికలు

కీలక రహస్యాలను వాటికి సంబంధించిన పత్రాలను ఇంటర్నెట్‌లో పంచుకోవద్దని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా డిజిటల్‌ అసిస్టెంట్లను ఆఫీసుల్లో వినియోగించవద్దని స్పష్టం చేసింది. అమెజాన్‌ ఎకో, యాపిల్‌ హోం ప్యాడ్‌, గూగుల్‌ హోం వంటివి వినియోగించవద్దని పేర్కొంది. దీంతోపాటు అలెక్సా, సిరి వంటి అసిస్టెంట్లను వాడొద్దని తెలిపింది. కీలకమైన అంశాలపై సమావేశాలు నిర్వహించే సమయంలో ఫోన్లను సమావేశ మందిరాల బయటే డిపాజిట్‌ చేసి రావాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు కీలక సమాచారాన్ని పంపించడానికి వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇవి ఆయా విభాగాల భద్రతా పరమైన నియమాలను, నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పాలసీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లే అని పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వ రహస్యాలకు సంబంధించిన పత్రాలను క్లోజ్డ్‌ నెట్‌వర్క్‌లో మాత్రమే షేర్‌ చేసుకోవాలని పేర్కొంది. అది కూడా సైంటిఫిక్‌ అనాలసిస్‌ గ్రూప్(ఎస్‌ఏజీ) స్థాయి ఎన్‌క్రిప్షన్‌ అయి ఉండాలని స్పష్టం చేసింది. ఎస్‌ఏజీ గ్రూప్‌ డీఆర్‌డీవో పరిధిలో పనిచేస్తుంది. కమర్షియల్ అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్ (AES) 256-బిట్ మెకానిజం ఉన్న నెట్‌వర్క్‌ల ద్వారా కీలక రహస్య సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పంచుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది. అటువంటి సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి ప్రభుత్వ ఇ-మెయిల్ సౌకర్యం లేదా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ సంవాద్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సందేశ్ వంటి ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని సమాచార మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. అత్యంత రహస్య సమాచారం వర్గీకరణను ఇంటర్నెట్‌లో పంచుకునే ఉద్దేశంతో దానిని తీవ్రతను తగ్గించరాదని హెచ్చరించింది. ‘‘ఇ-ఆఫీస్ సిస్టమ్‌లో సరైన ఫైర్‌వాల్‌లు, ఐపీ అడ్రస్‌ల వైట్‌లిస్ట్‌లను అమలు చేయాలని సూచించింది. మెరుగైన భద్రత కోసం ఇ-ఆఫీస్ సర్వర్‌ను వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ద్వారా యాక్సెస్ చేయవచ్చు.. లీజుకు తీసుకున్న లైన్ క్లోజ్డ్ నెట్‌వర్క్, SAG గ్రేడ్‌తో మాత్రమే ఇ-ఆఫీస్ సిస్టమ్‌లో అత్యంత రహస్య లేదా రహస్య సమాచారాన్ని పంచుకోవాలి’ అని పేర్కొంది ‘‘అధికారిక ప్రయోజనాల కోసం వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించి, ప్రభుత్వ సంస్థలు అందించే సౌకర్యాలను ఉపయోగించాలి. మెరుగైన భద్రతను నిర్ధారించడానికి కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.. అయినప్పటికీ, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అత్యంత రహస్య సమాచారాన్ని పంచుకోలేరు. ఇంటి నుంచి పని చేసే అధికారులు వీపీఎన్, ఫైర్‌వాల్ సెటప్ ద్వారా ఆఫీసు సర్వర్‌లకు అనుసంధానం చేసిన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లతో సహా హై సెక్యూరిటీ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించాలి’’ని పేర్కొంది. అలాగే, వర్క్ ఫ్రమ్ హోమ్ వాతావరణంలో అత్యంత రహస్య లేదా రహస్య సమాచారాన్ని పంచుకోలేమని మంత్రిత్వ శాఖ తెలిపింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/ZfLn7sz

No comments:

Post a Comment