పదేళ్ల కిందట జపాన్ను తాకిన భూకంపం వల్ల సునామీ సంభవించింది. దీని కారణంగా ఫుకుషిమాలోని అణు విద్యుత్ ప్లాంటుకు పెద్ద నష్టం జరిగింది. రేడియేషన్ లీకేజీలకు కారణమైంది. అనేక రియాక్టర్లు శాశ్వతంగా దెబ్బతిన్నాయి. తాజాగా, అదే ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించడంతో జనం భయంతో వణికిపోయారు. తూర్పున ఫుకుషిమా ప్రాంతంలో 7.3 తీవ్రతో బుధవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపలో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 100 మందికిపైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/gkXVrQ3
0 Comments