జగన్ జెరూసలేం పర్యటన.. సీఎం భద్రత కోసం రూ.22 లక్షలు

ఏపీ సీఎం మోహన్ రెడ్డి నేడు (ఆగష్టు 1న) బయలుదేరి వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా ఆయన జెరూసలేం వెళ్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ లోటస్ పాండ్ సమీపంలోని నివాసానికి జగన్, ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ముంబై వెళ్తారు. అక్కడి నుంచి విమానంలో నేరుగా జెరుసలేం వెళ్తారు. ఆగష్టు 4 వరకు జగన్ అక్కడే ఉండనున్నారు. ఈ నెల 5న ముంబై మీదుగా విజయవాడ వస్తారు. సీఎం పర్యటన పూర్తి వ్యక్తిగతమని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం జెరూసలేం పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం రూ.22 లక్షల 52 వేలను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లో సీఎం భద్రతా ఏర్పాట్ల కోసం ట్రిపుల్ ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు 30591 డాలర్లను చెల్లించున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడం కోసం హైదరాబాద్‌లోని ట్రావెల్ ఏజెంట్ ‘ఎయిర్ ట్రావెల్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్‌’కు రూ.22,52,500 చెల్లిస్తోంది. సీఎం పర్యటన వ్యక్తిగతమైనప్పటికీ.. ఆయన భద్రత కోసం ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/330wvUs

Post a Comment

0 Comments