జైపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్ నివాళి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌ నివాసంలో పుష్పాంజలి ఘటించారు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో కేసీఆర్‌తో పాటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేకే, సంతోష్ కుమార్‌‌లతో పాటూ పలువురు టీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. ఇటు మృతిపట్ల సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని.. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలని.. ఆయన వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం అద్భుతమన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జైపాల్ రెడ్డి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున ప్రకటన విడుదల చేశారు. రాజకీయ మేధావి, రాజనీతిజ్ఞుడు జైపాల్ రెడ్డి మరణం దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన జైపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎంతో సంక్లిష్టమైందన్నారు. మహోన్నత వ్యక్తిని కోల్పోయిన ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని.. తన తరఫున, జనసేన పార్టీ తరఫున భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. మరోవైపు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు రాష్ట్రప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. సోమవారం ఉదయం జైపాల్‌రెడ్డి ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం గాంధీభవన్‌కు జైపాల్‌రెడ్డి పార్థీవదేహాన్ని తరలిస్తారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/316vwAx

Post a Comment

0 Comments