వివేక్‌ను కలిసిన ఉత్తమ్.. మనసు మార్చుకుంటారా!

మాజీ ఎంపీ వివేక్‌ను తెలంగాణ పీసీసీ చీఫ్ కలిశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో వివేక్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. సుమారు అరగంటకుపైగా భేటీ కొనసాగింది. ఇద్దరు నేతలు తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఉత్తమ్, వివేక్‌ను కలవడంపై రక,రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివేక్‌ను ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారనే ప్రచారం మొదలయ్యింది. అందుకే ఆయనతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు కాబట్టి పార్టీలోకి మళ్లీ వస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే వివేక్ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను వివేక్ కలిశారు. తెలంగాణలో కొత్త సెక్రటేరియెట్ నిర్మాణం, ఎర్రమంజిల్‌లో భవనాల కూల్చివేతపై ఫిర్యాదు చేశారు. షాతో భేటీ తర్వాత వివేక్ బీజేపీలో చేరతారని.. ఆషాడం తర్వాత కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉత్తమ్ వివేక్‌ను కలవడం ఆసక్తిగా మారింది. వివేక్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వెంకట స్వామి కుమారుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు.. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారు. కానీ 2019 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు.. దీంతో ఆయన పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. వెంటనే తన నామినేటెడ్ పదవితో పాటూ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/336LwUW

Post a Comment

0 Comments