ఏపీ అసెంబ్లీలో వరుసపెట్టి నోరు జారుతున్నారు. ఏదో చెప్పాలనుకునే తొందరలో తడబడిపోతున్నారు.. నోరు జారుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ఊరుకుంటారా.. వెంటనే వీడియోలను సోషల్ మీడియా వాల్కు ఎక్కించేస్తున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లపై తెలుగు తమ్ముళ్లు వీడియోను వైరల్ చేస్తున్నారు. మాజీ మంత్రి, జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తడబాటుకు.. సినిమాల్లో వీడియో క్లిప్పుల్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఇదండీ ‘స్టిక్కర్ ముఖ్యమంత్రి గారి బృందం వారి మాటలు.. నిజంగా పెద్ద కామెడీ’అంటూ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. గాజువాకలో పవన్ కళ్యాణ్పై గెలిచిన తిప్పల నాగిరెడ్డి.. విశాఖలో నీటి సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ‘అప్పట్లో YSR మా నియోజకవర్గానికి తాగునీటి అవసరాల కోసం రూ.186 కోట్లు ఇస్తే.. వాటిలో రూ.1250 కోట్లు నా వార్డుకే కేటాయించారు’అన్నారు. నియోజకవర్గం మొత్తానికి రూ.186 కోట్లు కేటాయిస్తే.. ఒక్క వార్డుకి రూ.1250కోట్లు ఎలా కేటాయిస్తారంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా అలాగే తడబడ్డారు. టీసీఎల్ కంపెనీ జగన్ తీసుకొచ్చారని చెప్పారు. కానీ అది చంద్రబాబు హయాంలో వచ్చిందని తెలియదా అంటూ తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేశారు. అలాగే అమెరికాను కనిపెట్టింది వాస్కోడిగామా అని చెప్పబోయి.. అమెరికాను కనిపెట్టింది వాస్కోడామ్ అంటూ తడబడ్డారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు అప్రమత్తం చేసినా మళ్లీ తడబడ్డారు. కొద్ది రోజుల క్రితమే దెందలూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అసెంబ్లీలో నోరు జారారు. విద్యావ్యవస్థ గురించి మాట్లాడిన ఆయన.. స్వామి వివేకానందను కాస్తా.. స్వామి వివేకానంద రెడ్డి చేసేశారు. “If the poor cannot come to education, education must reach them, at the plough, in the factory and everywhere” మన స్వామి వివేకానంద రెడ్డి గారు అన్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నోరు జారిన ఎమ్మెల్యేను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ్ముళ్లకు దొరికిపోయారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yh381Z
0 Comments