మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలు కెళతారంటున్నారు రెబల్ స్టార్, నేత . ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం కాబోతున్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దవాళ్లు చెప్పినట్లు చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలని.. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు అంటూ చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో కేంద్రం తనను జైలులో పెడుతుందేమోనని చంద్రబాబు వ్యాఖ్యానించారని.. సానుభూతితో ఓట్ల కోసం విమర్శలు చేశారని.. ఇప్పుడు అది నిజం కాబోతోందని.. తప్పు చేసిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్కు తెలంగాణపై అతి ప్రేమ మంచిది కాదన్నారు రెబల్ స్టార్. ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీలోకి చేరేందుకు చాలామంది వస్తున్నారని.. ఈ వలసలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. రాష్ట్రానికి బీజేపీ న్యాయం చేస్తుందని.. కేంద్రం కూడా ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చారన్నారు. తెలుగు ప్రజలందరికీ న్యాయం జరగాలన్నది తన అభిలాష అన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YqqvEZ
0 Comments