చిత్తుగా ఓడి 3 నెలలైనా కాలేదు.. మెదడులో చిప్ పాడైనట్లుంది.. విజయసాయి సెటైర్లు

ఇసుక కొరత కారణంగా టీడీపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. ఆ పార్టీ నేత తొలిసారిగా రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇసుకాసురా.. జగన్ మోహనా.. భస్మాసురా అంటూ సీఎంపై లోకేశ్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎంపై లోకేశ్ చేసిన విమర్శలకు రాజ్యసభ సభ్యుడు కౌంటర్ ఇచ్చారు. చిత్తు చిత్తుగా ఓడిపోయి మూడు నెలలు కాలేదు. మిమ్మల్ని ఓడించిన ప్రజలు రాక్షసులా? అని లోకేశ్‌ను విజయసాయి ప్రశ్నించారు. ‘‘ఏకపక్ష తీర్పుతో వారు విజయ తిలకం దిద్దిన వ్యక్తి భస్మారుడా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా? ఈ వయసులోనే మెదడులో చిప్ పాడైనట్లుంది. కాస్త రిపేర్ చేయించండి. కాబోయే పార్టీ అధ్యక్షుడు కదా?’’ అంటూ లోకేశ్‌ను ఉద్దేశించి విజయసాయి ట్వీట్ చేశారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబే అంటూ విజయసాయి మరో ట్వీట్ చేశారు. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారని ఆరోపించారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారన్న విజయసాయి.. 600 మందిని హత్య చేశారని ఆరోపిచారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారని చురకలు అంటించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/30MfUSJ

Post a Comment

0 Comments