బీసీ హాస్టల్‌లో విద్యార్థి హత్య.. బాలుడి అన్న నిద్ర లేవకపోవడంతో..

కృష్ణాజిల్లా బీసీ హాస్టల్‌లో మూడో తరగతి విద్యార్థి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాసరి ఆదిత్య (8)ను ఒకే వ్యక్తి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆదిత్య (8) సోదరుడు అశోక్ కూడా అదే హాస్టల్‌లో ఉంటూ ఏడో తరగతి చదువుకుంటున్నాడు. కాగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు అశోక్‌ను నిద్రలేపాడని పోలీసుల విచారణలో తేలింది. అశోక్ నిద్ర లేవకపోవడంతో.. నిందితుడు ఆదిత్యను తీసుకెళ్లి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ వివాదాలే హత్యకు కారణమని భావిస్తోన్న పోలీసులు.. హంతకుడెవరో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. క్లూస్ టీం, జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. తోటి విద్యార్థుతో పాటూ హాస్టల్ వార్డెన్‌ను ప్రశ్నిస్తున్నారు. కింద రూమ్‌లో పడుకున్న బాలుడిని దుండగుడే నిద్రలేపి పైకి తీసుకెళ్లినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ రాత్రి హాస్టల్లో లేకపోవడం దుండగుడికి కలిసొచ్చింది. ఉదయం 5 గంటలకు వాచ్‌మెన్ వచ్చి పిల్లలను నిద్రలేపగా.. ఆదిత్య కనిపించడం లేదని చెప్పారు. ఇంటికి వెళ్లాడేమో కనుక్కోమని అన్నయ్య అశోక్‌ని, మరో బాలుడ్ని ఇంటికి పంపారు. ఇంతలోనే ఆదిత్య బాత్ రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిసింది. బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్దామని బాత్‌రూమ్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు. కానీ అప్పటికే చనిపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Tcz9SD

Post a Comment

0 Comments