భారత్ వల్ల కశ్మీర్లో పరిస్థితి దిగజారుతోంది.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల స్పందించింది. సరిహద్దుల వెంబడి భారత సైన్యం కాల్పులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ విషయమై పాక్ ప్రధాని స్పందిస్తూ.. భారత్ దాడులను ఖండించారు. నియంత్రణ రేఖ వెంబడి అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు. భారత్ 1983 నాటి ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ క్లస్టర్ బాంబులు పేలుస్తోందని ఆయన ఆరోపించారు. ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ‘‘(భారత) ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు సుదీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులకు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయం. ఐరాస తీర్మానాలకు అనుగుణంగా కశ్మీరీలు స్వీయనిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలి. కశ్మీర్‌లో శాంతి స్థాపనతోనే దక్షిణాసియాలో శాంతిభద్రతలు నెలకొంటాయి. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ అంగీకరించారు. భారత బలగాల చర్యలతో కశ్మీర్లో, ఎల్ఓసీ వెంబడి పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ప్రాంతీయ సంక్షోభానికి ఇది దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడానికి ఇదే సరైన సమయం’’ అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్లు చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KgXsvO

Post a Comment

0 Comments