అత్తపై కోపంతో మూడేళ్ల మరదలిపై రేప్

మగతోడు లేని కుటుంబానికి అండగా ఉంటాడు కదా అని పెద్ద కూతురిని మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసింది. తీరాచూస్తే ఆమెకే భారమయ్యాడు. పని చేయకుండా తాగుడుకు బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలని అత్తను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వనని చెప్పడంతో కక్ష పెంచుకుని ఆమె మూడో కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ముగ్గురు కుమార్తెలతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చింది. కాటేదాన్‌ సమీపంలోని శాంతినగర్‌లో నివాసముంటోంది. కుటుంబానికి అండగా ఉంటాడు కదా అని మూడేళ్ల క్రితం పెద్ద కుమార్తెను మేనల్లుడు రాజుకు ఇచ్చి పెళ్లి చేసింది. ఆ దంపతులు మహిళ ఇంటి సమీపంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాజు తాగుడుకు బానిసై భార్యను వేధిస్తున్నాడు. దీనికి తోడు మద్యం తాగేందుకు అత్తను డబ్బులు అడుగుతున్నాడు. దీంతో అత్తా అల్లుడి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్తపై కక్ష పెంచుకున్న రాజు శాంతినగర్‌లోని అంగన్‌వాడీకి వెళ్తున్న ఆమె మూడో కుమార్తెపై కన్నేశాడు. మంగళవారం అంగన్‌వాడీ కేంద్రం నుంచి చిన్న మరదలిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక ఏడుస్తుండటంతో ఏమైందని తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె బాలికతో పాటు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అల్లుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాజును అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OtVufJ

Post a Comment

0 Comments