ప్రాణం తీసిన టిక్‌టాక్ సరదా.. ఇద్దరు యువకుల మృతి

పిచ్చి ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. టిక్‌టాక్ కోసం సరదాగా రైలు పట్టాలపై నిలబడి వీడియో తీసుకోబోతే.. ఏకంగా ప్రాణాలే పోయాయి. మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తుండగా ట్రైయిన్ వచ్చి ఢీకొట్టడంతో చనిపోయారు. బెంగళూరులోని బయప్పనహళ్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మహ్మద్ మతీమ్, జబీవుల్లా, షరీఫ్‌లు స్నేహితులు. వీరిలో మతీమ్ మెకానిక్‌ కాగా.. షరీఫ్ ఫుడ్ డెలవరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ముగ్గురూ బయప్పనహళ్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని శ్రీరామపుర రైల్వేగేటు దగ్గర పట్టాలపై వీడియో తీసుకునేందుకు వెళ్లారు. ట్రైయిన్ వస్తుండగా టిక్‌టాక్ కోసం వీడియో తీసుకోవాలనుకున్నారు. వీరిలో షరీఫ్, మతీమ్‌ పట్టాలపై డ్యాన్స్ చేస్తుండగా.. జబీవుల్లా మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఈలోపు కోలార్ నుంచి వస్తున్న ప్యాసింజర్ ట్రైయిన్ అటు వచ్చింది.. దానిని కూడా గమనించకుండా వీడియో తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రైలు ఢీకొట్టడంతో అఫ్తాబ్‌ పట్టాల పక్కనే ఉన్న స్తంభానికి తగిలి పడిపోయాడు.. మిగిలిన ఇద్దరిపై నుంచి ట్రైయిన్ వెళ్లిపోయింది. ఘటనలో మతీమ్, షరీఫ్‌లు చనిపోగా.. జబీవుల్లాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2nAvQsM

Post a Comment

0 Comments