అదనపు కట్నం ఇవ్వలేదని భార్యను రైలు కిందికి తోసేశాడు

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. అదనపు కట్నం ఇవ్వడం లేదన్న అక్కసుతో భార్యను రైలు కిందికి తోసేసి చంపేశాడో కిరాతక భర్త. ఈ ఘటన పరిధిలోని సీబీ గంజ్‌ ప్రాంతంలో జరిగింది. రూబీ షా అనే మహిళకు సల్మాన్ అనే వ్యక్తితో ఆర్నెల్ల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ సల్మాన్ భార్యను వేధిస్తున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ రూబీని భర్త, అతడి అన్న, అత్త, ఆడపడుచు వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆమెపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన రూబీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని నమ్మించిన సల్మాన్ ఆమెను బయటకు తీసుకెళ్లాడు. అటారియా రైల్వే క్రాసింగ్ వద్ద వేగంగా వెళ్తున్న రైలు కిందికి రూబీని తోసేశాడు. రైలు వేగంగా ఢీకొనడంతో రూబీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై రూబీ షా సోదరుడు రెహ్మాన్ షా స్పందిస్తూ.. సల్మాన్ కుటుంబం తన సోదరిని అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తోందని, చివరకు ప్రాణాలు కూడా తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రూబీని ముందస్తు పథకం ప్రకారమే బయటకు తీసుకొచ్చి రైలు కిందకి తోసేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీబీ గంజ్ పోలీసులు సల్మాన్‌తో పాటు అతడి కుటుంబంపై ఐపీసీ 304బి(వరకట్న హత్య) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ రాజ్‌కుమార్ భరద్వాజ్ తెలిపారు. సల్మాన్‌ను అరెస్ట్ చేశామని, అతడి కుటుంబ సభ్యులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Ul52ZI

Post a Comment

0 Comments