భార్య ఆత్మహత్య.. విషయం తెలిసి లండన్ నుంచి వచ్చిన భర్త కూడా

భర్తపై కోపంతో వివాహిత ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన భర్త కూడా మరుసటి రోజే రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్న ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. భార్యభర్తల మధ్య తలెత్తిన చిన్న వివాదం కారణంగా 10నెలల చిన్నారి అనాథగా మారింది. Also Read: మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన శివరాత్రి రమాదేవి (27), మెట్టెల గంగయ్య(34) సైన్స్‌లో పీజీ చేశారు. ఒకే ఊరివాళ్లు కావడంతో వారిమధ్య ప్రేమ చిగురించి పెద్దల అనుమతితో మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే సౌదీలో ఉద్యోగం కోసం వెళ్లి రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నారు. 10 నెలల క్రితం రమాదేవి పుట్టింట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో లండన్‌లో మంచి ఉద్యోగం రావడంతో గంగయ్య అక్కడికి వెళ్లాడు. నెల రోజుల క్రితం భార్య, బిడ్డలను చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలోనే దంపతుల ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్యను పీహెచ్‌డీ చేయాలని గంగయ్య కోరగా అందుకు ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కూడా ఈ విషయంపైనే ఇద్దరికీ గొడవలు జరిగాయి. Also Read: గంగయ్య లండన్ తిరిగివెళ్తూ పీహెచ్‌డీ చేస్తేనే తనతో తీసుకెళ్తానని, లేకపోతే పుట్టింట్లోనే ఉండిపోతావ్ అంటూ హెచ్చరించి వెళ్లిపోయాడు. భర్త చేసిన హెచ్చరికతో తీవ్ర మనోవేదనకు గురైన రమాదేవి గురువారం (ఆగస్టు 29న) ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగయ్య లండన్ చేరుకోగానే బంధువులు ఈ విషయం ఫోన్ చేసి చెప్పడంతో ఆయన షాకయ్యారు. వెంటనే తిరుగుపయనమై శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాడు. అనూహ్యంగా శనివారం ఉదయం ఘట్‌కేసర్-బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య శవమై కనిపించాడు. Also Read: మృతదేహం వద్ద లభించిన ఓటర్, ఆధార్ కార్డుల ఆధారంగా గంగయ్యగా గుర్తించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో భార్యను చివరిసారి చూసేందుకు గంగయ్య వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు షాకయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారిని చూసి అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత చదువులు అభ్యసించి కూడా చిన్న విషయానికే రమాదేవి, గంగయ్య ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZwceYM

Post a Comment

0 Comments