Mumbai: ఫెయిలైనందుకు తిడతారని కిడ్నాప్ డ్రామా ఆడింది

పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన బాలిక తల్లిదండ్రుల వద్ద సానుభూతి కోసం ఆడిన కిడ్నాప్ డ్రామా బెడిచికొట్టింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆమె ఆడిన నాటకాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇంకోసారి ఇలాంటి పని చేయొద్దని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. Also Read: ముంబయికి చెందిన ఓ బాలిక(17) ఇంటర్ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం ట్యూషన్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రయినా కుమార్తె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి ఆరా తీయగా అక్కడికి రాలేదని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత తండ్రి ఫోన్‌కు ఓ వాయిస్ మెజేస్ వచ్చింది. డాడీ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. త్వరగా వచ్చి రక్షించండి’ అని బాలిక ఆ మెసేజ్‌లో వేడుకుంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: బాలిక వద్దనున్న సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆఖరిగా సిగ్నల్ అందిన ప్రాంతంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా క్లూ దొరికింది. శనివారం రాత్రి ముంబయిలోని వాసయ్ రైల్వేస్టేషన్‌లో బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక ఇటీవల రెండు పరీక్షల ఫెయిల్ అయిందని, ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారన్న ఆందోళనతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో రైలెక్కి అహ్మదాబాద్ చేరుకుందని, అక్కడ మరో రైలెక్కి తిరిగి ఒంటరిగానే ముంబయి చేరుకుందని తెలిపారు. బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించి పంపించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2mNYrKS

Post a Comment

0 Comments