జిల్లాలో ఆటోడ్రైవర్ దారుణ హత్య కలకలం రేపుతోంది. మండలంలోని తరుణవాయి సమీపంలో దువ్వూరు కాలువ బ్రిడ్జిపై మంగళవారం వెంగారెడ్డిపాళెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రాఘవ (35) అనే ఆటోడ్రైవర్ను దుండుగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. రాఘవ 10 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. Also Read: అయితే రాఘన రెండు నెలలుగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సోమవారం ప్రియురాలి ఇంటి మీదుగా ఆటోలో వెళ్తున్న రాఘవ ఆమెపై చాక్లెట్ విసిరి గాల్లో ముద్దులు పెట్టాడు. ఈ ఘటనను మహిళ భర్త గమనించి రాఘవతో ఘర్షణ పడ్డాడు. Also Read: అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వెళ్తున్న రాఘవను వెంకటేశ్ తలపై కొట్టి, కాలితో గొంతు నులిమి చంపేశాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంగం ఎస్సై శ్రీకాంత్తో పాటు నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం ఇన్ఛార్జ్ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణలో రాఘవకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలియడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి వెంకటేశ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాఘవను చంపింది తానేనని అంగీకరించడంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/38H14B6
0 Comments