భార్య క్యారెక్టర్‌పై అనుమానం.. 18నెలల కొడుకు గొంతు కోసి హత్య

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే కొడుకుని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. సి.బెళగల్ మండలంలోని చింతమానుపల్లి గ్రామంలో నాగేశ్వర్‌రెడ్డి, సరితకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇన్నాళ్లూ సజావుగానే సాగిన వీరి కాపురంలో ఇటీవలే కలహాలు మొదలయ్యాయి. భార్య మరొకరితో పెట్టుకుందని నాగేశ్వర్‌రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. దీంతో రోజూ మద్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. బిడ్డలు తనకు పుట్టలేదని, వేరొకరితో కన్నావంటూ ఆమెను సూటిపోటి మాటలు అనేవాడు. Also Read: ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికొచ్చిన నాగేశ్వర్‌రెడ్డి తల్లి ఒడిలో నిద్రపోతున్న 18 నెలల కొడుకు సందీప్‌ను మరో గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పొత్తిళ్లలో ఉండాల్సి బాబు కనిపించకపోవడంతో సరిత ఇల్లంతా వెతకగా గదిలో రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో ఆమె వెంటనే సి.బెళగల్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ht5EYg

Post a Comment

0 Comments