మధ్యప్రదేశ్: భారీ షాక్.. ఇంటికి రూ.80 లక్షల కోట్ల కరెంట్ బిల్లు!


కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో విద్యుత్ బిల్లులను నిలిపివేయగా.. ప్రస్తుతం వస్తున్న బిల్లులు జనాల్ని షాక్‌కు గురిచేస్తున్నాయి. ‘మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు’ చందంగా కరోనాతో జనం అష్టకష్టాలు పడుతున్న సమయంలో విద్యుత్‌ బిల్లులు మోత మోగిస్తున్నాయి. ప్రస్తుతం మీటరు రీడింగ్‌ ప్రకారం బిల్లులు ఇవ్వడంతో రెట్టింపు చార్జీలు వస్తున్నాయి. రెండు నెలల రీడింగ్‌ ఒకేసారి తీయడంతో స్లాబ్‌ మారి చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని వినియోగదారులు గగ్గోలుపెడుతున్నారు. రెండు నెలలు రీడింగ్ అంతా కలిసి బిల్లులు భారీగా వస్తుండటంతో వినియోగదారులు విస్తుపోతున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో రూ.80 లక్షల కోట్లు బిల్లు రావడంతో వినియోగదారుడు అవాక్కయాడు. సింగ్రౌలి జిల్లాలోని బైఢన్ గ్రామంలోని ఓ ఇంటికి రూ.80 లక్షల కోట్లు బిల్లు వేసి అధికారులు ఇచ్చారు. ఈ బిల్లును చూసి ఆ ఇంటి యజమాని షాక్ తిన్నాడు. దీనిపై సదరు యజమాని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితుడు వాపోయాడు. అధికారులు చేసిన తప్పిదంతోనే ఇలా జరిగిందని, అయినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందాడు. ఛార్జీలు పెంచకపోయినా.. ఏ,బి,సి స్లాబులతో బిల్లులు రెట్టింపుగా కనిపిస్తున్నాయి. కరెంటు స్లాబుల మార్పు ఒకవైపు, రెండు నెలలు కలిపి ఒకేసారి రీడింగ్‍ తీయటం మరోవైపు బాదుడుకు తెరదీయగా.. కరెంటు సిబ్బంది కూడా పనిలో పనిగా.. డోర్‍లాక్‍ పేరుతో మోత మోగిస్తున్నారట


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cBKPGE

Post a Comment

0 Comments