అర్ధరాత్రి ఫేస్‌బుక్‌లో మహిళ‌ పోస్ట్.. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి పోలీసులు

జిల్లాలో ఓ మహిళ పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పిల్లలతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అర్థరాత్రి 12 గంటలకు ఆమె పెట్టిన పోస్ట్ ఓ ఉద్యోగి ద్వారా గ్రామీణ జిల్లా ఎస్పీ విజయరావు దృష్టికి వచ్చింది. అర్ధరాత్రి అయినా ఆయన మానవత్వంతో స్పందించి ఆమె ఉంటున్న ప్రాంత పోలీసులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సకాలంలో మహిళ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరించారు. Also Read: నరసరావుపేట మండలంలోని ములకలూరు గ్రామానికి చెందిన పారా చంద్రిక.. కుటుంబ సమస్యల కారణంగా చనిపోతున్నానని, అమ్మా నాకు నీతో మాట్లాడాలని ఉంది, ఇవే నా చివరి మాటలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం అర్ధరాత్రి 12గంటలకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఈ పోస్టు గ్రామీణ జిల్లా ఎస్పీ దృష్టికి రాగా ఆయన వెంటనే స్పందించి నరసరావుపేట గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వన్‌టౌన్‌ సీఐ ప్రభాకర్‌, గ్రామీణ ఎస్సై రోశయ్య గ్రామానికి వెళ్లి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆమె ఎక్కడున్నది కనిపెట్టారు. Also Read: ఆ మహిళను ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. ఏదైనా సమస్య వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ధైర్యం చెప్పి వెళ్లారు. ఆపదలో ఉన్నవారు ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారం కాదని.. డయల్ 100కి ఫోన్ చేస్తే తాము సాయం చేస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు. మహిళతో పాటు ఆమె పిల్లలను సకాలంలో కాపాడిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2U5F6m8

Post a Comment

0 Comments