మొదటి భార్య ఉండగానే మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూర్ సమీపంలోని బాగాయంమేట్టు ఇలయాంబట్టి రోడ్డు ప్రాంతానికి చెందిన రామచంద్రన్ తొరప్పాడిలో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా దంపతులు కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం అడుకంపారై ఓసూర్ అమ్మన్ ఆలయంలో మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రామచంద్రన్ సిద్ధమయ్యాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి అక్కడికి చేరుకుని పెళ్లిపీటలపై ఉన్న భర్తను నిలదీసింది. ఈ ఉదంతంతో షాకైన వధువు బంధువులు కూడా రామచంద్రన్తో గొడవకు దిగారు. పెళ్లి కాలేదని నమ్మించిన రెండో పెళ్లికి సిద్ధమైన అతడిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రామచంద్రన్తో పాటు వధువు కుటుంబసభ్యులను స్టేషన్కు తరలించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతున్న తరుణంలోనే రామచంద్రన్కు గుండెపోటు రావడంతో చికిత్స కోసం అడుకంపారై ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2U6iEZU
0 Comments