అమెరికాలో మరణించిన నల్ల జాతీయుడికి కరోనా పాజిటివ్

నల్లజాతీయుడి మృతితో అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలసిందే. నిరసనకారులు ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. అక్కడ నిరసన జ్వాలలు చల్లారక ముందే... మరో విషయం తెలిసిందే. అమెరికా పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ కు కరోనా వైరస్ సోకి ఉందని తేలింది. అతని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ ఫ్లాయిడ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తరువాత, అతని కుటుంబీకుల అనుమతితో 20 పేజీల రిపోర్టును విడుదల చేశారు. కరోనా వైరస్ ఉన్నా, ఫ్లాయిడ్ లో లక్షణాలేవీ బయటకు కనిపించ లేదన్నారు. మరణించిన సమయంలో ఆయన ఊపిరితిత్తులు సైతం ఆరోగ్యంగానే ఉన్నాయని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ తెలిపారు. ఫ్లాయిడ్ మరణించిన తీరును పరిశీలిస్తే, దీన్ని నరహత్యగానే భావించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మెడపై బలమైన ఒత్తిడి కారణంగానే ఆయన మరణించాడని నిర్ధారించారు. ఫ్లాయిడ్ మృతిపై గతంలో అమెరికన్ పోలీసులు ఇచ్చిన నివేదికను ఆయన తప్పుబట్టారు. పోలీసుల నివేదికలో ఫ్లాయిడ్ లో శ్వాసకోశ మాంద్యం, మూర్చ వంటి లక్షణాలు ఉన్నాయని తెలిపారన్నారు. అలాంటివేవి తమ పరిశీలనలో కనిపించలేదని ఆండ్రూ బ్రేక్ తన రిపోర్టులో వెల్లడించారు. దీంతో అమెరికన్ పోలీసులకు మరోషాక్ తగిలినట్లు అయ్యింది. ఇప్పటికే జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికా వ్యాప్తంగా నల్లజాతీయులు నిరసనలకు దిగారు. వాషింగ్టన్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికా భారత్‌కు క్షమాపణలు కోరింది. అమెరికాలో గాంధీ విగ్రహాంపై జరిగిన దాడిపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ స్పందించారు. వాషింగ్టన్ డి.సి.లోని గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించండి... దయచేసి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండని భారతదేశంలో యూ.ఎస్. రాయబారి కెన్ జస్టర్ తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cvweN0

Post a Comment

0 Comments