ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తనను వదిలేసి మరో యువకుడితో తిరుగుతుందన్న కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మాజీ ప్రేయసిపై హెల్మెట్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాకట రాజధాని బెంగళూరులోని నెలమంగల సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన ఓ యువతి(21) జబిత్ అనే యువకుడితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవల మనస్పర్థలు రావడంతో అతడి నుంచి విడిపోయింది. కొద్దిరోజులకే అదే ప్రాంతానికి చెందిన రాహుల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. మాజీ ప్రేయసి కొత్త ప్రియుడితో తన కళ్లెదుటే తిరుగుతుండటాన్ని జబిత్ తట్టుకోలేకపోయాడు. Also Read: ఈ క్రమంలోనే మంగళవారం ఆమె కొత్త ప్రియుడితో ఓ ప్రాంతానికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న జబిత్ అక్కడి వెళ్లి హెల్మెట్తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె ఇంటికి ఫోన్ చేసి మీ కూతురికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని యువతిని హాస్పిటల్కు తరలించారు. అయితే ఆమె శరీరంపై ఉన్నవి యాక్సిడెంట్ గాయాలు కావని, ఎవరో దాడి చేసినట్లుగా ఉందని డాక్టర్లు చెప్పడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో యువకులిద్దరూ స్నేహితులని, కొత్త ప్రియుడు సమాచారం ఇవ్వడంతోనే జబిత్ అక్కడికి వెళ్లి ఆమెపై దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fhFuGh
0 Comments