కొడుకుని రోకలిబండతో బాది.. కన్నతండ్రి ఘాతుకం.. గుంటూరులో దారుణం

చెట్టంత ఎదిగిన కొడుకుని దారుణంగా కొట్టి చంపేశాడో కసాయి తండ్రి. మద్యానికి బానిసై భార్యాబిడ్డలను వదిలేసిన కొడుకు.. నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో భరించలేక కిరాతకానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న కొడుకుని అమానుషంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలం గొట్టిపాడుకి చెందిన ఏసోబు, రత్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు నరేష్(35)కి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన నరేష్ వేధింపులు భరించలేక భార్యాపిల్లలతో కలసి వేరుగా ఉంటోంది. అప్పటి నుంచి నరేష్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఫుల్లుగా మందు తాగొచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. Also Read: కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో తల్లిని కొట్టడంతో ఆమె గ్రామంలోనే ఉన్న తన సోదరుడి ఇంటికెళ్లింది. నిత్యం వేధింపులు భరించలేపోయిన ఏసోబు కొడుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో తలపై బలంగా కొట్టాడు. తలకు తీవ్రగాయాలై నరేష్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2AEwNXp

Post a Comment

0 Comments