గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసిన పాకిస్థాన్

తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడటానికి అక్రమంగా చొరబడిన ఇద్దరు భారతీయులను అరెస్టు చేసినట్లు పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీ‌ర్‌లో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లోకి వారు ప్రవేశించారని, వారి వద్ద ఉన్న భారత కరెన్సీ, గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డాన్‌ పత్రిక పేర్కొంది. పాక్ పోలీసులకు పట్టుబడిన ఇద్దరూ తాము కశ్మీర్‌లోని బందిపుర జిల్లా గురెజ్‌ సెక్టార్‌లోని అచోరా నివాసితులమని, తమ పేర్లు నూర్‌ మహమ్మద్‌ వని, ఫిరోజ్‌ అహ్మద్‌ లోన్‌గా పేర్కొన్నారని పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారిని గూఢచర్యం కోసం బలవంతంగా పాకిస్థాన్‌ భూభాగాల్లోకి పంపించినట్లుందని పోలీసులను ఉటంకిస్తూ డాన్‌ పత్రిక పేర్కొంది. Read Also: అయితే, పాకిస్థాన్ పోలీసులకు పట్టుబడిన ఫిరోజ్ అహ్మద్‌లోన్ 2018లో తప్పిపోయిన తన సోదరుడని గ్యురేజ్‌కు చెందిన జహూర్ లోన్ అనే వ్యక్తి తెలిపారు. రెండేళ్ల కిందట తప్పిపోయిన తన సోదరుడు చనిపోయాడని భావించామని అన్నాడు. తప్పిపోవడానికి ముందు రౌఫ్ అహ్మద్ అనే టెరిటోరియల్ ఆర్మీ ఉద్యోగితో తన సోదరుడు సన్నిహితంగా ఉన్నట్లు ఫోన్ కాల్స్ రికార్డులు సూచిస్తున్నాయని చెప్పాడు. పాక్‌ భూభాగంలోకి తాను ఎలా ప్రవేశించానే వివరించిన వీడియో చూసి షాక్ తిన్నానని అన్నాడు. Read Also: ఇదే విషయాన్ని తమ కుటుంబసభ్యులకు తెలియజేశానని, రౌఫ్ అహ్మద్‌పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రౌఫ్ తనను బలవంతంగా పాకిస్థాన్‌లోకి పంపినట్టు తన సోదరుడు ఆ వీడియోలో స్పష్టంగా చెప్పాడని పేర్కొన్నాడు. గ్రామీణ అభివృద్ధి శాఖలో గ్రామస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, 2018లో ఆయనకు వివాహమయ్యిందని తెలిపాడు. 2018 నవంబరులో ఇంటి నుంచి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఫిరోజ్.. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడన్నారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37uMo88

Post a Comment

0 Comments