లాక్డౌన్ కారణంగా అన్ని వ్యాపారాలు మూతపడినా వ్యభిచార నిర్వాహకులు మాత్రం చెలరేగిపోతూనే ఉన్నాయి. ఓ పక్క నిరుపేదలు తిండి దొరక్క అల్లాడుతుంటే.. కరోనా కాలంలోనూ శారీరక సుఖం వెంపర్లాడే రసిక ప్రియుల కోసం కొందరు అమ్మాయిలను సరఫరా చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడా ఉపాధి లేకపోవడంతో అక్రమార్కులు అమ్మాయిలను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించుతూ దందా నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని గుట్టుగా సాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని మైలార్దేవ్పల్లి పోలీసులు చేధించారు. నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. Also Read: హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన అబ్దుల్ మిస్కిన్(30) దంపతులు సంపాదన కోసం వ్యభిచారాన్ని ఎంచుకున్నారు. షేక్ ముస్తాక్(27) అనే ఆటో డ్రైవర్తో కలిసి ముంబయి నుంచి ఇద్దరు యువతులను నగరానికి రప్పించారు. పాతబస్తీ, రాజేంద్రనగర్ సర్కిల్ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వారితో చేయిస్తున్నారు. విటులు ఫోన్చేస్తే ఆటోలో షేక్ ముష్తాక్ ఆ యువతులను వారింటికి తీసుకువెళ్తాడు. మూడు రోజుల క్రితం శాస్త్రిపురం డివిజన్లోని కింగ్స్కాలనీలో ఓ ఇంటిని ఈ ముఠా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. Also Read: ఆ ఇంటికి అర్ధరాత్రి సమయంలో కూడా యువకులు వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు మైలార్దేవ్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం అర్ధరాత్రి ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన ఇద్దరు సెక్స్వర్కర్లను సంరక్షణ గృహానికి తరలించారు. కరోనా వైరస్ కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ ఓ వైపు అధికారులు, వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తుంటే కొన్నిచోట్ల ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటం కలవరపరుస్తోంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/30EjVvv
0 Comments