వైజాగ్ దివ్య హత్యకేసు.. రిమాండ్‌కు ఆరుగురు నిందితులు, పిన్నిపైనా కేసు


తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన దివ్య దారుణ హత్య కేసు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జీవితంలో ఎన్నో విషాదాలను కళ్లారా చూసి అభాగ్యురాలిగా మారిన దివ్య చేరదీసిన వాళ్ల చేతుల్లోనే చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు పంచే విషయంలో నిలదీసిందన్న కారణంతో దివ్యకు గుండు గీయించి, శరీరమంతా వాతలు పెట్టి, అన్నం పెట్టకుండా కడుపు మాడ్చి చంపేశారు కిరాతకులు. ఈ కేసును రెండ్రోజుల్లోనే చేధించిన విశాఖ పోలీసులు ఆరుగురు నిందితులను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను వైజాగ్ ఫోర్త్ టౌన్ పీఎస్ ఇన్‌ఛార్జి సీఐ కోరాడ రామారావు వెల్లడించారు. Also Read: విశాఖ అక్కయ్యపాలెం చెక్కుడురాయి భవనం సమీపంలో చనిపోయిన దివ్య(23) ఘటనపై తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినట్లు వెల్లడైంది. దివ్యతో వసంత అనే మహిళ కొద్ది నెలలుగా వ్యభిచారం చేయిస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య డబ్బు పంపకాలకు సంబంధించి భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వసంత తన చెల్లెలు మంజు, తల్లి ధనలక్ష్మి, మరిది సంజయ్‌ సహకారంతో దివ్య కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో వస్త్రాలు కుక్కి గదిలో బంధించింది. శరీరంపై 33 చోట్ల వాతలు పెట్టి క్రూరంగా హింసించింది. ఆ బాధలు తట్టుకోలేక నీరసించిపోయిన దివ్య ప్రాణాలు వదిలేసింది. Also Read: ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి, అంత్యక్రియలు చేసేందుకు వసంత సిద్ధమైంది. అయితే అనుమానం వచ్చిన కాటికాపరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సూర్యనారాయణ ఘటనాస్థలికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ప్రధాన నిందితురాలైన వసంత(జ్యోతి)తో పాటు, ఆమె సోదరి మంజు(సంధ్య), తల్లి ధనలక్ష్మి, మరిది సంజయ్‌, దివ్య పిన్ని కాంతవేణి, గీతపై 302, 201, 343, 324 ఐటీపీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37buyHt

Post a Comment

0 Comments