ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విడుదలైన ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఇంటర్ సెకండియర్ ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునింది. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె స్వర్ణలత (17) ఇటీవలే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. అప్పటినుంచి మనస్తాపంతో ఉంటున్న కూతురిని తల్లిదండ్రులు సముదాయిస్తూ వచ్చారు. Also Read: శనివారం వ్యవసాయ పనుల నిమిత్తం తల్లిదండ్రులు మరో గ్రామానికి వెళ్లడంతో స్వర్ణలత ఒంటరిగా ఉంది. దీంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆమె ఎత్తకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో తల్లి వెంటనే ఇంటికి వెళ్లి చూడగా స్వర్ణలత ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2B8gvGo
0 Comments