భార్య, మామను చంపేసిన కిరాతకుడు .. వికారాబాద్‌లో దారుణం

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కట్టుకున్న భార్య, అడ్డుకున్న మామను కిరాతకంగా చంపేశాడు. దౌల్తాబాద్‌ మండలం బాలంపేట గ్రామానికి చెందిన అబ్దుల్‌గఫూర్‌మియా చిన్న కుమార్తె హాజీ బేగం(32)ను 14 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సైకిల్ మెకానికల్ ఖలీంకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు మగపిల్లలు. కాపురంలో కలహాల కారణంగా హాజీ బేగం 8 నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. Also Read: రెండ్రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ఖలీం కాపురానికి రావాలని కోరగా హాజీ బేగం నిరాకరించింది. దీంతో భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి గొడవపడ్డాడు. మామ అతడికి నచ్చజెప్పి కొద్దిరోజులు తమ వద్దే ఉంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతామని చెప్పాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భోజనాలయ్యాక భార్యభర్తలు ఓ గదిలో, హజీబేగం తండ్రి మనవలుతో కలిసి మరో గదిలో నిద్రపోయారు. మంగళవారం ఉదయం నిద్రలేచిన తర్వాత భార్యతో మరోసారి గొడవపడిన ఖలీం కత్తితో ఆమెను నరికి చంపేశాడు. కూతురి కేకలు విన్న తండ్రి గదిలోకి వెళ్లగా అతడి ప్రాణం కూడా తీశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఖలీంపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yiz7vw

Post a Comment

0 Comments