కరోనా మహమ్మారితో కకావికలమవుతున్న దేశ వాణిజ్య నగరం ముంబైని విపత్తులూ వెంటాడుతున్నాయి. నగరంలోని అతిపెద్ద మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పండ్లు, కూరగాయాల షాపులకు ప్రసిద్ధి చెందిన క్రాఫర్డ్ మార్కెట్లో గురువారం (జూన్ 11) రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ధ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్కు సమీపంలోనే ఈ మార్కెట్ ఉండటంతో ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న ముంబై నగరానికి ఇటీవల నిసర్గ రూపంలో తుఫాన్ ముప్పు వచ్చినా.. పెద్దగా ప్రభావం చూపకపోవడంతో నగరవాసులు ఊరట పొందిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల కిందట నగరంలోని పలు ప్రాంతాలను కమ్మేసిన దుర్వాసన ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ వాసనకు కారణాలేంటో ఇప్పటికీ తేలలేదు. తాజాగా అగ్ని ప్రమాదం సంభవించడం ముంబై వాసులను కలవరానికి గురిచేస్తోంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2AXXOW4
0 Comments