హైదరాబాద్ నగరంలో వరుస హత్యల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఒకేరోజు నాలుగు హత్యలతో నగరం ఉలిక్కిపడిన సంగతి మరువకముందే శనివారం మరో హత్య కలకలం రేపింది. సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్సీయూ)లో పనిచేస్తున్న సత్యనారాయణ (50) అనే వ్యక్తి శనివారం రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో దారుణహత్యకు గురయ్యాడు. గండిపేట్ మండలంలోని హైదర్షాకోట్లో నివసించే సత్యనారాయణ(50) హెచ్సీయూలో పనిచేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన హిమాయత్సాగర్ గ్రామం పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో హత్యకు గురై కనిపించాడు. Also Read: స్థానికుల సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది చంపేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3eUSaTh
0 Comments