అసోం: ఆయిల్ ఇండియా చమురు బావిలో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి

అసోంలో ఆయిల్ ఇండియాకు చెందిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకయి.. మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాలుగా పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండగా.. మంగళవారం మంటలంటుకున్నాయి. టాక్సికియా జిల్లాలోని బాగేజన్ గ్యాస్ బావికి మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారిని అక్కడ నుంచి తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండగా.. దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలముకున్నాయి. ఈ మంటలు చాలా కిలోమీటర్ల దూరంలోని డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ నుంచి కూడా కనబడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు మంటలు అంటుకున్నాయి.. కానీ, దీనికి కారణం మాత్రం తెలియదని కార్పొరేట్ కమ్యూనికేషన్ సీనియర్ మేనేజర్ జయంత్ బోరుముండి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు ఓఎన్‌జీసీ ఫైర్‌మెన్‌లు ప్రాణాలు కోల్పోయారు. చమురు బావికి మంటలు అంటుకున్న వెంటనే సింగ్‌పూర్‌కి చెందిన ముగ్గురు నిపుణులను రప్పించి, అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. బాగేజన్ చమురు బావిలో గ్యాస్ నిక్షేపాల వెలికితీత జరుగుతుండగా.. మే 27నే మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. 3,729 మీటర్ల లోతులో సహజ వాయువు, చమురు వెలికితీత జరుగుతోంది. మే 27న మొదలైన మంటలను అదుపుచేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3f8Itk5

Post a Comment

0 Comments