దివ్య హత్యకేసులో మరో ట్విస్ట్.. తెరపైకి రౌడీషీటర్ పేరు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దివ్య దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసు కస్టడీలో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు ఆమె చెల్లి గీత అనేక సంచలన విషయాలు బయటపెడుతున్నారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా వరుసగా రెండో ఫోర్త్ టౌన్ పోలీస్‌‌స్టేషన్‌లో వారిద్దరిని వేర్వేరుగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దివ్య హత్య కేసులో ఓ రౌడీషీటర్ హస్తం ఉన్నట్లు వెల్లడైంది. మరోవైపు వసంత మరిది సంజయ్య ఫోన్‌లోని డేటా డిలీట్‌ చేసేందుకు సహకరించిన దొండపర్తిలోని ఓ సెల్‌‌షాపు యజమానిని పోలీసులు విచారించారు. అయితే సంజయ్ నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాకే డేటా డిలీట్ చేశానని, అంతకుమించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడు పోలీసులకు చెప్పాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ మీనా నిందితులను స్వయంగా విచారిస్తూ కీలక విషయాలు రాబడుతున్నారు. Also Read: ఈ కేసుకు సంబంధించి సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ.. కుటుంబసభ్యుల హత్యకు గురికావడం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వదిలేయడంతో ఒంటరైన దివ్య పిన్ని ఇంటికి వచ్చింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న పిన్ని దివ్యను వైజాగ్‌లో ఉండే వసంత ఇంటికి పనిమనిషిగా వచ్చింది. అయితే అందంగా ఉండే దివ్యతో వ్యభిచారం చేయిస్తే బాగా డబ్బులు సంపాదించొచ్చని దురాలోచన చేసింది. ఆమెకు డబ్బు ఆశ చూపించి వ్యభిచారంలోకి దించింది. దివ్యని వివాహం చేసుకున్న వీరబాబుకు కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్‌ అమ్మమ్మ నాగమణి ఓ రౌడీషీటరు చేతిలో హత్యకు గురయ్యా. దీంతో ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నాం. హత్యతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం రెండు బృందాలు ఇప్పటికే రావులపాలెం, ఏలేశ్వరం పంపించాం. ప్రస్తుతం వసంత, గీతను మాత్రమే విచారిస్తున్నామని, రిమాండ్‌లో ఉన్న మిగిలిన నలుగురినీ పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు అనుమతించింది. దీంతో వారిని శుక్రవారం నుంచి విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తామని సీపీ తెలిపారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cXjoqV

Post a Comment

0 Comments